telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

రేపు .. వెస్టిండీస్‌ సిరీస్ కోసం .. జట్టు ఎంపిక కష్టమే..

india team may select tomorrow for westindies series

ప్రపంచ కప్ తరువాత మొదటి సిరీస్ కు భారత జట్టు ఎంపిక రేపు ముంబై లో జరుగుతుంది. ఇప్పటికే జట్టు సారధి కోహ్లీ సహా అందరూ ముంబై కి చేరుకున్నారు. వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. కానీ రేపు జట్టు ఎంపికకు సంబంధించిన సమావేశం జరిగే అవకాశం లేదని తెలుస్తుంది. రేపు జట్టు ఎంపిక కానీ పక్షంలో శని లేదా ఆదివారం సెలక్షన్‌ కమిటీ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో జట్టు ఎంపిక జరగవచ్చు.

ప్రపంచ కప్‌ తర్వాత టీమిండియాకు తొలి సిరీస్‌ కావటంతో ఎంపికయ్యే భారత జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వికెట్‌ కీపర్‌ ధోనీ విండీస్ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదో అనే సమాచారం లేదు. భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీ గురువారం స్వదేశానికి చేరుకున్నాడు. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌లు భారత్‌ తలపడనుంది.

Related posts