రెండో టి20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్ కు బ్యాటింగ్ అప్పగించాడు. మొదట్లో ధాటిగా ఆడిన బంగ్లా ఆటగాళ్లు ఆ తర్వాత నిదానించారు. ఓపెనర్ లిటన్ దాస్ (29), మహ్మద్ నయీం (36) శుభారంభాన్ని అందించారు.
సౌమ్య సర్కారు 30, కెప్టెన్ మహ్మదుల్లా 30 పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో చాహల్ 2, చహర్, ఖలీల్ అహ్మద్, సుందర్ తలో వికెట్ పడగొట్టారు. ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచిన బంగ్లా జట్టు ఈ మ్యాచ్ తో సిరీస్ కైవసం చేసుకునేందుకు పట్టువదలకుండా ఆడుతున్నారు.