దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఈరోజు కొత్తగా 4,184 మంది కొవిడ్ బారినపడ్డారు. వైరస్ ధాటికి మరో 100 మందికిపైగా మృతి చెందారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 44,488 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,20,120 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,15,459మంది మరణించారు.
మరోవైపు ..దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. బుధవారం మరో 18,23,329 డోసులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకూ దేశంలో 1,79,53,95,649 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు