telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ సినిమా వార్తలు

2019 ప్రపంచ కప్ : .. నిలకడగా ఆడుతున్న భారత్.. స్టేడియం లో మహేష్ కుటుంబం..

india playing well and mahesh in stadium

క్రికెట్ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ ప్రారంభమైంది. ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు సూపర్‌స్టార్ మహేష్ బాబు తన కుటుంబంతో సహా హాజర హాజరయ్యారు. దర్శకుడు వంశీపైడిపల్లి కూడా వీరితోపాటు మ్యాచ్ వీక్షించేందుకు మైదానానికి వెళ్లారు.

ప్రస్తుతం మహేష్ కుటుంబం యూరప్ యాత్రలో భాగంగా ప్రతిష్టాత్మకమైన భారత్‌, ఆసీస్ మ్యాచ్ ఇంగ్లండ్‌లో జరుగుతుండడంతో ప్రత్యక్షంగా వీక్షించేందుకు మైదానానికి వెళ్లారు. ఈ సందర్భంగా మహేశ్‌, నమ్రత, గౌతమ్‌లతో కలిసి దిగిన సెల్ఫీని వంశీ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.

పదిహేను ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 75/0, రోహిత్ 31, ధావన్ 41 పరుగులతో ఆడుతున్నారు.

Related posts