ప్రపంచ కప్ లో భాగంగా మాంచెస్టర్ వేదికగా పాక్ తో తలపడుతున్న భారత్ నిలకడగా ఆడుతుంది. పాక్ పేసర్లు అమీర్, వాహబ్ రియాజ్, హసన్ అలీ కొత్తబంతితో భారత్ కు ఎలాంటి సమస్యలు సృష్టించలేకపోయారు.
రోహిత్ శర్మ దూకుడుగా ఆడగా, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును నడిపించారు. రోహిత్ 34 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 17 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 99 పరుగులు. రోహిత్ శర్మ 60, రాహుల్ 36 పరుగులతో ఆడుతున్నారు.
అమ్మాయి నచ్చితే ఫస్ట్ డేనే అడిగేస్తా… రామ్ గోపాల్ వర్మ సంచలన వర్మ