telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

మొదటి టీ20లో టాస్ గెలిచి.. ఫీల్డింగ్ లో భారత్..

barat-newzeland t20 match from today

మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మ్యాచ్ నేడు భారత్-న్యూజిలాండ్ ల మధ్య జరుగుతుంది. ఇప్పటికే వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని, మంచి ఊపు మీద ఉన్న టీమిండియా… టీ20 సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. వెల్లింగ్టన్ లో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రిషభ్ పంత్, విజయ్ శంకర్, కార్తీక్, ధోనీ (కీపర్), హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, చాహల్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్. భారత జట్టులో అన్నదమ్ములైన హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాలు ఉండటం గమనార్హం.

న్యూజిలాండ్ జట్టు: విలియంసన్ (కెప్టెన్), మన్రో, మిచెల్, సీఫర్ట్ (కీపర్), టేలర్, గ్రాండ్ హోమ్, శాంట్నర్, కగ్గెలీన్, సౌథీ, సోధీ, ఫెర్యూసన్.

ఆతిధ్య జట్టు భారీ స్కోర్ దిశగానే వెళ్తుంది. తాజా సమాచారం ప్రకారం 17 ఓవర్ లకు గాను 186 పరుగులు సాధించి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇదిలా ఉండగా నేడు జరిగిన భారత్-న్యూజిలాండ్ మహిళా టీ20 మొదటి మ్యాచ్ లో కివీస్ విజయం సాధించింది. నిర్ణిత ఓవర్లలో కివీస్ 159 పరుగులు చేయగా, భారతజట్టు 136 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది.

Related posts