టీమిండియాకు ప్రస్తుతం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లాంటి ప్లేయర్ అవసరమని వెస్టిండీస్ మాజీ పేస్ బౌలర్ మైకేల్ హోల్డింగ్ పేర్కొన్నాడు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ భారీ ఛేదనలో ధోనీ నైపుణ్యం, అతడి పాత్రను టీమిండియా ఎంతో మిస్ అవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇండియన్ టీమ్లో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారని, అయితే ధోనీ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని హోల్డింగ్ అన్నాడు. ‘భారీ స్కోరు ఛేదన అంటే భారత్కు క్లిష్టమే. జట్టులో ఎంఎస్ ధోనీ లేకపోవడం టీమిండియాకు కష్టంగా మారింది. సగం మంది పెవిలియన్కు చేరిన అనంతరం మహీ క్రీజులోకి వచ్చినా ఛేదనను నియంత్రణలోకి తీసుకొస్తాడు. గతంలో ధోనీ జట్టులో ఉన్నప్పుడు భారత్ గొప్ప విజయాలు సాధించింది. ప్రస్తుత టీమిండియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగానే ఉంది. కొంత మంది ఆటగాళ్లు అద్భుతమైన స్ట్రోక్ప్లే కలిగి ఉన్నారు. హార్దిక్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. కానీ కోహ్లీ సేనకు ధోనీ వంటి ప్లేయర్ అవసరం. మహీ నైపుణ్యమే కాదు, జట్టులో అతడి పాత్రా ఎంతో కీలకం’ అని హోల్డింగ్ అన్నాడు. ‘అంతేగాక ఎంఎస్ ధోనీ జట్టులో ఉంటే టాస్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ధోనీ సామర్థ్యం అందరికీ తెలుసు. ఛేదనలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతడు కంగారు పడటం మనం ఎన్నడూ చూడలేదు. లక్ష్యాన్ని ఎలా సాధించాలో అతడికి బాగా తెలుసు. తనతో పాటు క్రీజులో ఉండే ఆటగాడికి అతడు సలహాలు ఇస్తూ సాయం చేస్తుంటాడు. కాగా భారత్కు ప్రస్తుతం గొప్ప బ్యాటింగ్ దళం ఉన్నా లక్ష్య ఛేదనలో ధోనీ స్పెషల్ మ్యాన్’ అని మైకేల్ హోల్డింగ్ చెప్పాడు.
previous post
next post
సీఏఏ వల్ల మత సామరస్యం దెబ్బతింటుంది: శరద్ పవార్