telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత్…

భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న చివరి టెస్టు లో మూడో రోజు ఆట ప్రారంభమైంది. అయితే నిన్న వర్షం కారణంగా ఆట ఆగిపోయే సమయానికి 62/2 తో నిలిచిన భారత్ నేడు ఆట ప్రారంభమైన కొత్త సమయానికే పుజారా(25) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. దాంతో భారత్ ప్రస్తుతం 127/3 నిలిచింది. ఇక పుజారా పెవిలియన్ కు చేరుకున్న తర్వాత కెప్టెన్ రహానేతో కలిసి బ్యాటింగ్ చేయడానికి మయాంక్ అగర్వాల్ క్రీజులోకి వచ్చాడు. అయితే ఈరోజు మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సమయానికే స్టార్ ఆటగాడు పుజారా పెవిలియన్ కు చేరుకోగా ఇప్పుడు భారత కెప్టెన్ అజింక్య రహానే 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టార్క్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దాంతో 144 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది టీం ఇండియా. రహానే పెవిలియన్ కు చేరుకోగా మయాంక్(25) తో కలిసి బాటింగ్ చేయడానికి పంత్ వచ్చాడు. అయితే భారత జట్టు ఆసీస్ కంటే ఇంకా 225 పరుగులు వెనకబడి ఉంది. చూడాలి మరి ఈరోజు మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.

Related posts