ఇవాళ భారత్ షూటింగ్ వరల్డ్కప్లో రెండు స్వర్ణాలు లభించాయి. బీజింగ్లో జరుగుతున్న టోర్నీలో.. 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్సిడ్ టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నది. ఈ ఈవెంట్లో భారత్కు చెందిన మనూ భాకర్, సౌరబ్ చౌదరీలు గోల్డ్ మెడల్ గెలిచారు. టీమ్ ఫైనల్లో 16-6 స్కోర్తో స్వర్ణాన్ని చేజిక్కించుకున్నారు.
చైనాకు చెందిన జియాంగ్ రాక్సిన్, పాంగ్ వీలపై ఇండియన్ టీమ్ విజయం సాధించింది. మరో మిక్సిడ్ ఈవెంట్లోనూ భారత్ స్వర్ణ పతకం వచ్చింది. అంజుమ్ మౌద్గిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్లు 10మీ ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో గోల్డ్ దక్కించుకున్నారు. చివరి షాట్లో 20.6 పాయింట్ల సాధించిన స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు.
దర్శకుడితో గోడపై స్పందించిన నాగశౌర్య… ఇంకెప్పుడూ అతనితో మాట్లాడడట…!?