telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

దేశంలో కొనసాగుతున్న కోవిడ్..కొత్తగా 22,752 మందికి కరోనా

Corona

దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో రోజురోజుకూ కేసుల స్సంఖ్య భారీగా పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 22,752 మందికి కొత్తగా కరోనా సోకిందని వెల్లడించింది.దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 7,42,417 కు చేరుకుంది.

మృతుల సంఖ్య మొత్తం 20,642కి పెరిగింది. 2,64,944 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,56,831 మంది కోలుకున్నారు. నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,04,73,771 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,62,679 నమూనాలను పరీక్షించినట్లు వివరించింది.

Related posts