మన దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 45,951 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,62,848 కి చేరింది. ఇందులో 2,94,27,330 మంది కోలుకొని డిశ్చార్జ్కాగా, 5,37,064 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 817 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,98,454 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 60,729 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో ఇప్పటి వరకు 33,28,54,527 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.