దేశంలో కరోనా వ్యాప్తి భారీగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 6,915 కొవిడ్ కేసులు నమోదయ్యాయి..16,864 మంది కోలుకున్నారు. ఈ మహమ్మారి నుంచి 180 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 180 కొత్త మరణాలు నమోదవడంతో మరణాల సంఖ్య 5,14,023కి చేరుకుంది.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 92,472గా ఉంది. ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.22 శాతం ఉన్నాయి. అయితే దేశంలో రికవరీ రేటు మరింత మెరుగుపడి 98.59 శాతానికి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. సోమవారం మరో 18,22,513 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,77,70,25,914కు చేరింది.