telugu navyamedia
ఆరోగ్యం

ఇండియాలో తగ్గిన క‌రోనా కేసులు ఎన్నంటే..?

భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 27,409 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. క‌రోనాతో 347 మంది మరణించించిన‌ట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తాజా బులెటిన్ లో తెలిపింది. మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,17,60,458‬ మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి.

ప్రస్తుతం దేశంలో 4,23,127 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,26,65,534 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,09,358 మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.23 శాతంగా ఉండి

దేశవ్యాప్తంగా సోమవారం 12,29,536 కరోనా పరీక్షలు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 75,30,33,302కు చేరింది.

మ‌రోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ ముమ్మ‌రంగా కొన‌సాగుతుంది. తాజాగా 44,68,365 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,73,42,62,440 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Related posts