telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

వెల్లింగ్ట‌న్ వేదికగా తొలిటెస్ట్… పిచ్ పై కలవరం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

oneday

భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య వెల్లింగ్ట‌న్ వేదికగా శుక్ర‌వారం నుంచి తొలి టెస్టు జ‌రుగ‌నుంది. ఈ నేప‌థ్యంలో బీసీసీఐ తాజాగా మ్యాచ్ వేదికైన బేసిన్ రిజ‌ర్వ్ మైదానం పిచ్‌ను ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. అయితే ప‌చ్చిక కాస్త ఎక్కువ ఉండ‌టంతో ఇది పేస‌ర్లకు అనుకూలిస్తుంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. అయితే బీసీసీఐ పిచ్‌ను పోస్టు చేయ‌గానే.. నెటిజ‌న్లు త‌మ స్పంద‌న‌ను వ్య‌క్తం చేశారు. ఇలాంటి పిచ్‌పై తొలుత బ్యాటింగ్ క‌ష్ట‌మనే అర్ధంలో ట్వీట్లు చేశారు. ఈ పిచ్ పేస‌ర్ల‌కు స్వ‌ర్గ‌ధామమ‌ని పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మ‌రోవైపు తొలి టెస్టు ప్రారంభ‌మ‌య్యేనాటిక‌ల్ల ఈ పిచ్‌పై ప‌చ్చికను తొల‌గించే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ న‌లుగురు పేస‌ర్ల‌తో బ‌రిలోకి దిగుతోంద‌ని తెలుస్తోంది. అయితే భార‌త కెప్టెన్ మాత్రం ముగ్గురు పేస‌ర్లు జ‌స్‌ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ ష‌మీ, ఇషాంత్ శ‌ర్మ‌ల‌తోపాటు ఇక స్పిన్న‌ర్‌తో ఆడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈక్ర‌మంలో జట్టులో ఏకైక స్పిన్న‌ర్ స్థానం కోసం సీనియ‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా మ‌ధ్య పోటీ నెల‌కొని ఉంది.pitch at Basin Reserve looks like.

Thoughts ? #NZvIND pic.twitter.com/XND442GJFN

— BCCI (@BCCI) February 20, 2020

Related posts