బాలీవుడ్ నటుడు సోనూసూద్కు చెందిన ముంబయిలోని నివాసంలో ఆదాయపన్ను విభాగం సోదాలు నిర్వహించింది. అలాగే ముంబయిలో ఆయనకు సంబంధించిన మరికొన్ని చోట్ల, లఖ్నవూలోని కంపెనీలో ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం సంబంధిత వర్గాలు మీడియా వెల్లడించాయి. ఆదాయ వివరాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘దేశ్ కే మెంటార్స్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ సోనూసూద్ ఇటీవల నియమితులైన సంగతి తెలిసిందే. దానికింద పాఠశాల విద్యార్థులకు మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ నియామకం జరిగిన కొద్ది రోజులకే సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో రాజకీయాల్లో చేరడం గురించి ఆయన్ను ప్రశ్నించగా.. మంచిపని చేయడానికి రాజకీయాల్లోనే చేరాల్సిన పనిలేదన్నారు. దానిపై స్పష్టత ఇవ్వడానికి నిరాకరించారు.
మళ్ళీ దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి