telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కేంద్రంతో పాటుగా .. 11 రాష్ట్రాలకు .. సుప్రీం కోర్టు నోటీసులు.. 

supreme court two children petition
దేశంలో వివిధ ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్న కశ్మీరీ విద్యార్థులపై పుల్వామా ఘటన తర్వాత  దాడులు జరుగుతున్నాయి. వారిని బహిష్కరించాలని పలు రాష్ట్రాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కశ్మీరీ విద్యార్థులపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయాలంటూ దాఖలైన ఒక పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు… కేంద్ర ప్రభుత్వం సహా 11 రాష్ట్రాలకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
దాడులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని 11 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సహా ఢిల్లీ పోలీస్ చీఫ్ కు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. తారిక్ అదీబ్ అనే పిటిషనర్ తరపున సుప్రీం సీనియర్ న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో, పిటిషన్ ను వెంటనే విచారించాలని వారు కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎల్ఎన్ రావు, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పిటిషన్ ను విచారించింది.

Related posts