telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కవిత ట్వీట్ చేసిన పాక్ ప్రధాని… ట్రోలింగ్ స్టార్ట్ చేసిన నెటిజన్లు

Pak people attack pak poilet

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను నెటిజన్లు తమదైన శైలిలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దానికో కారణం ఉంది. అదేంటంటే… ఇమ్రాన్ పోస్ట్ చేసిన కవితలో ఓ తప్పు ఉంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన “జీవితమంతా సంతోషభరితమని నేను నిద్రపోయి కల కన్నాను. నేను నిద్రలేచి చూశాను. జీవితమంతా సేవ అని తెలిసింది. చివరకు సేవ చేయడమే సంతోషభరితమని గుర్తించాను” అనే సూక్తిని ఇమ్రాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పోస్ట్ చేయడం వరకు బాగానే ఉంది. అయితే, ఈ సూక్తిని ఖలీల్ జిబ్రాన్ అనే కవి రాసినట్లు ఆయన పోస్ట్ చేయడం గమనార్హం. ఇది గమనించిన నెటిజన్లు పాక్ ప్రధానిపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఒక దేశానికి ప్రధాని స్థానంలో ఉండి…సూక్తి బాగున్నా అది ఎవరిదో తెలుసుకోకుండా పోస్ట్ చేయడంపై ఇమ్రాన్‌ను ట్రోల్ చేస్తున్నారు.

Related posts