telugu navyamedia
రాజకీయ వార్తలు

అణుయుద్ధ బెదిరింపుల వల్ల రక్తపాతం: ఇమ్రాన్

imran pakistan pm

భారత పౌరసత్వ సవరణ బిల్లుపై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీ ఓ పద్ధతి ప్రకారం హిందూ ఆధిపత్య ఎజెండాను అమలు చేస్తున్నారని ట్వీట్ చేశారు. అలాగే, అణుయుద్ధ బెదిరింపుల వల్ల పెద్ద ఎత్తున రక్తపాతం జరుగుతుందని అన్నారు. ఊహించనన్ని దుష్పరిణామాలు జరిగే అవకాశం ఉందన్నారు. పరిస్థితి చేయి దాటకముందే ప్రపంచం అడ్డుకోవాలని ఇమ్రాన్ సూచించారు.

ఇమ్రాన్ వ్యాఖ్యలపై భారత్ ఘటుగా స్పందించింది. తమ అంతర్గత విషయంలో తలదూర్చడం మానుకోవాలని హితవు పలికింది. తొలుత పాకిస్థాన్‌లోని మైనారిటీల సంగతి చూడాలని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రవీశ్‌కుమార్‌ కౌంటరిచ్చారు.

Related posts