భారత్ తో చర్చలకు సిద్ధమని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో ప్రసంగించారు . ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని టీవీ ఛానల్స్ ప్రసారం చేశాయి . మంగళవారం నాడు బాలాకోట్ పై జరిగిన దాడికి ప్రతీకారం తీసుకుంటామని ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్ కొన్ని గంటల్లోనే మాట మార్చేశాడు అతని స్వరంలో తీరు కూడా మారిపోయింది .
“మీ భూభాగంలోకి మేము వచ్చాము , మా భూభాగంలోకి మీరు వచ్చారు … ఇప్పుడు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని వున్నాయి ,యుద్ధం మొదలు పెట్టడం సులువే… కానీ ఆ తరువాత నా చేతుల్లో కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల్లో కానీ ఉండదు … మొదటి ప్రపంచ యుద్ధం , రెండవ ప్రపంచ యుద్ధం ఫలితాలు అందరికీ తెలుసు… అందుకే సమస్యను సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకుందాం ” అని సందేశం ఇచ్చాడు.
పాకిస్తాన్ ప్రజలకు యుద్ధం వాళ్ళ జరిగే నష్టాలను పరోక్షంగా చెప్పాడు . భారత్ తో యుద్ధం చేయలేమని చేతులెత్తేశాడు . పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంతలోనే ప్లేట్ మార్చేయడంలో ఆంతర్యమేమిటో తెలుసా ? భయం … అంతులేని భయం … పాకిస్తాన్ సర్వ నాశనం అయిపోతుందనే ఆందోళన . అమెరికా ఆర్ధిక సహాయాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది . ఉగ్ర దాడిని సహించమని హెచ్చరించింది .
పక్కనే వున్న చైనా ఆదుకుంటుందని భావిస్తే భారత్ తో కలసి ఉగ్ర కార్యకలాపాలను ఆపేయవలసిందే . ఉగ్ర మూకలను తరిమేయవలసిందే అని హుకుం జారీ చేసింది . ఇండియా చర్యను సమర్ధించింది . ఇక రష్యా ఎప్పుడు భారత మిత్ర దేశమే. . ఇవ్వాళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇమ్రాన్ ఖాన్ పై మండిపడ్డాడు . ఉగ్రవాదుల విసయంలో రాజీ పడనని తీవ్ర స్వరంతో హెచ్చరించాడు .
పాకిస్తాన్ కు అన్ని దారులు మూసుకుపోయాయి . ఆపన్న హస్తం అందించేవారు కనబడటం లేదు . ఒకవేళ యుద్ధమే మొదలైతే పాకిస్తాన్ ఒంటరై పోవడం ఖాయం . అన్ని దేశాలు భారత్ కే సపోర్ట్ చేస్తాయి . భారత్ వైపు వచ్చి పోరాడతాయి . అదే జరిగితే పాకిస్తాన్ ఉనికి మిగలదు . ఈ విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ గ్రహించాడు . అందుకే చర్చలకు సిద్ధమని కాళ్లబేరానికి వచ్చాడు .
భారత ప్రధాని నరేంద్ర మోడీ అనుసరించిన విదేశీ విధానం ఇప్పుడు ఫలవంతమైంది . అన్ని దేశాలు భారత్ కు బాసటగా నిలబడ్డాయి . ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం పై అంతర్జాతీయ సమాజం , భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి !
ఏపీకీ సీఎం జగన్ బాహుబలివంటి వారు: రోజా ప్రశంసలు