శ్రీలంక రాజధాని కొలంబో ఎయిర్పోర్టు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఐఈడీ బాంబును పోలీసులు గుర్తించారు. ఎయిర్పోర్టుకు వెళ్తున్న దారిలో రోడ్డుపక్కన బాంబు ఉండడాన్ని గమనించి పోలీసులు దాన్ని నిర్వీర్యం చేశారు. ఈ విషయమై శ్రీలంక ఎయిర్ఫోర్స్ అధికార ప్రతినిధి గిహన్ సెనివిరత్నే మాట్లాడుతూ ఆరు ఫీట్ల పొడవున్న బాంబును పైపులో అమర్చారని ఆయన పేర్కొన్నారు. దీన్ని పోలీసులు ముందే గమనించడంతో పెనుప్రమాదం తప్పింది. ఆ బాంబును జాగ్రత్తగా నిర్వీర్యం చేశామన్నారు.
శ్రీలంకలో ఆదివారం ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు వరుసగా ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుళ్ల ధాటికి వందల సంఖ్యలో మృతి చెందారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 290కి చేరుకోగా, వివిధ ఆస్పత్రుల్లో 600 మంది చికిత్స పొందుతున్నారు.
సీఏఏ అనేది మత సంఘర్షణలకు దారి తీసే దుశ్చర్య: కేరళ సీఎం