అమెరికాలో జెన్నిఫర్ జానస్ అనే 49 ఏళ్ళ మహిళ కారుపైన పాడ్లింగ్ పూల్ను పెట్టుకుని రోడ్డుపైన వెళ్లడం కలకలం సృష్టించింది. అది పాడ్లింగ్ పూల్ మాత్రమే అయితే వార్త అయ్యేది కాదు… కానీ అందులో పదేళ్ల వయసు కూడా లేని తన ఇద్దరు కూతుళ్లను కూడా ఉంచింది. దీంతో రోడ్డుపై ఈ దృశ్యాన్ని చూసినవాళ్లు స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఆ కారు జెన్నిఫర్కు చెందినది అని తెలుసుకున్న పోలీసులు ఆమెపై కేసును నమోదు చేశారు. జెన్నిఫర్ తన స్నేహితురాలి ఇంటి వద్ద పాడ్లింగ్ పూల్కు గాలి పెట్టించి తిరిగి వస్తున్న సమయంలో ఇది జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరు చిన్నారులను అలా కారుపై పూల్లో పెట్టి ఎలా తీసుకొస్తారని, చిన్నారుల ప్రాణాలంటే లెక్క లేదా అంటూ జెన్నిఫర్పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు చిన్నారుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రవర్తించిన ఓ తల్లిని ఇల్లినోయిస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
previous post
బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది: ఉత్తమ్