telugu navyamedia
వార్తలు సామాజిక సినిమా వార్తలు

తిరువణ్ణామలైలో బాలు కోసం మోక్ష జ్యోతిని వెలిగించిన ఇళయరాజా

Ilayaaraja music director

సినీ రంగంలో ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దాదాపు ఐదు దశాబ్దాలుగా వారు ప్రాణస్నేహితుల్లా మెలిగారు. ఒకరు సంగీత దర్శకులు, మరొకరు గానగాంధర్వుడు ఈ ఇద్దరినీ కలిపింది సంగీతమే. ఇటీవల పొరపొచ్చాలు వచ్చినా  వెంటనే సమసిపోయింది.

ఎస్పీ బాలు కరోనా బారినపడినప్పుడు ఇళయరాజా తల్లడిల్లిపోయారు. బాలు ఇక లేరన్న వార్త తెలియగానే ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ తన ఆప్తమిత్రుడి కోసం మౌనంగా రోదించారు.

నిన్ననే ఎస్పీ బాలు అంత్యక్రియలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇళయరాజా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలో బాలు కోసం మోక్ష జ్యోతిని వెలిగించారు. ఆయనకు మోక్షం ప్రాప్తించాలంటూ ఆ అరుణాచలేశ్వరుడిని ప్రార్థించారు.
గతంలో సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కోసం ఇలాగే ఇళయరాజా దీపం వెలిగించారు.

Related posts