telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు విద్యా వార్తలు

ఏపీ: టిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

Adimulapu sures

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వల్ల మొదటి సారి ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించామని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్. గతం లో పదవ తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాల్లో అవకాశాలు కల్పించే వాళ్ళమని పేర్కొన్నారు. పరీక్షకు మొత్తం విద్యార్థులు 85, 755 హాజరయ్యారని తెలిపారు. జనవరి 4 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. జనవరి 18 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. 99 మార్కులతో టాప్ ర్యాంకర్స్ గా గుర్రం వంశీకృష్ణ, పోతుగంటి జకీర్ హుస్సేన్ నిలిచారని ఆయన తెలిపారు. విద్యతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్‌ ఉంటుందని తెలిపారు. ఏపీలో విద్యార్థులకు అనేక సదుపాయాలు జగన్ ప్రభుత్వం కల్పించిందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం అందించే సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 

Related posts