కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లోకి వెళ్తానని ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, ఇంకా ఏ పార్టీలో చేరలేదని ఆయన తెలిపారు. తన నియోజకవర్గ అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమని అందుకే టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వెల్లడించారు. టీఆర్ఎస్ బీ ఫాం మీద తిరిగి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని రేగా కాంతారావు ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేతలు తనపై ఆంక్షలు విధించడం తనకు నచ్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 12న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉమ్మడి ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఎమ్మెల్యే కారు ఎక్కడానికి సిద్ధమయ్యారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా.. తెలంగాణ స్కూళ్లలో అధిక ఫీజులు: లక్ష్మణ్