ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈరోజు కడప జిల్లా ఇడుపులపాయలోని తండ్రి వైఎస్సార్ ఘాట్ను సందర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జగన్ తో పాటు తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం తండ్రి సమాధిపై పూలమాలలు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఘాట్ వద్దకు భారీగా చేరుకున్న అభిమానులకు అభివాదం చేశారు. జగన్తో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ప్రార్థనల అనంతరం జగన్ ఇడుపులపాయలో పర్యటించనున్నారు.