telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫ్యాన్సీ రేట్‌కు ‘ఇద్దరి లోకం ఒకటే’ శాటిలైట్ రైట్స్

iok

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మాతగా.. జి.ఆర్. కృష్ణ డైరెక్షన్‌లో రాజ్ తరుణ్, శాలిని పాండే హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి వరుస అపజయాలతో ఉన్న రాజ్ తరుణ్‌తో, నిర్మాత దిల్ రాజు పెద్ద సాహసమే చేస్తున్నారనే వార్తలు బాగా వినిపించాయి. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై ఇప్పుడు ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ హాట్ కేక్‌లా అమ్ముడుపోవడమే.. చిత్రంపై క్రేజ్‌ అమాంతం పెరగడానికి కారణంగా తెలుస్తోంది. సినిమాలు విడుదలైనా కూడా శాటిలైట్ బిజినెస్‌కు నోచుకోని చిత్రాలు ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద గట్టిగానే వినబడుతున్నాయి. కానీ విడుదలకు ముందే ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ఫ్యాన్సీ రేట్‌కు అమ్ముడుపోవడం చూస్తుంటే ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రంలో మ్యాటర్ గట్టిగానే ఉన్నట్లు అర్థమవుతోంది.మరో విషయం ఏమిటంటే.. శాటిలైట్ రైట్స్‌తోనే సినిమా బడ్జెట్ వచ్చేసిందని దిల్ రాజు చెబుతుండటం, సొంతంగా ఆయనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం వంటివి చూస్తుంటే.. పరాజయాల్లో ఉన్న రాజ్ తరుణ్‌‌‌ ఖాతాలో ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం ఓ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయం అనేలా ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts