4న రాష్ట్రంలోని టీవీ ఆర్టిస్టులకు రవీంద్రభారతిలో గుర్తింపు కార్డులను అందజేయనున్నట్టు సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. శనివారం మాసబ్ట్యాంక్లోని కార్యాలయంలో ఫిల్మ్డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో 900 మంది టీవీ ఆర్టిస్టులు ఉన్నారని.. వారందరికీ గుర్తుంపుకార్డులు అందజేస్తామని చెప్పారు. ఆర్టిస్టులలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
షూటింగ్ల కోసం వివిధప్రాంతాలకు వెళ్తుంటామని.. ఆ సందర్భంలో తమకు పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అసోసియేషన్ సభ్యులు మంత్రికి పలు సమావేశాల్లో వివరించారు. అసోసియేషన్ వినతి మేరకు ప్రభుత్వం గుర్తింపుకార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఎఫ్డీసీ సీఈవో కిశోర్బాబు, ఈడీ హష్మి, సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పోటీ ప్రపంచంలో తెలుగు కంటే ఇంగ్లీషు అవసరమే ఎక్కువ: కత్తి మహేశ్