telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీకి వెళ్లనున్న ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి!

officers applied on deputation to AP

తెలంగాణ కేడర్‌లో ఉన్న  ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి   ఆంధ్రప్రదేశ్‌కు పోవడం దాదాపు ఖరారైనట్టు  తెలుస్తోంది.  ఆమె ఇప్పటికే జగన్‌తో మాట్లాడారని, ఏపీలో సేవలు అందించేందుకు అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. అందుకు ఆయన అంగీకరించారని తెలుస్తోంది.  కీలకమైన శాఖను అప్పగిస్తానని హామీ కూడా ఇచ్చారని తెలిసింది. శ్రీలక్ష్మి ఓబుళాపురం గనుల కుంభకోణం కేసులో జైలు పాలయ్యారు. 

జైల్లో అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత నిర్దోషిగా బయటికి వచ్చాక ఐఏఎ్‌సగా కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శ్రీలక్ష్మి అతి చిన్న వయస్సులో సివిల్‌ సర్వెంట్‌ అయ్యారు. ఆమె కెరీర్‌ ఒడిదుడుకుల్లేకుండా సాగితే కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి స్థాయికి వెళ్లేవారు. ఓబుళాపురం గనుల అవినీతి కేసులు మెడకు చుట్టుకోవడంతో వృత్తిపరంగా అనేక ఇబ్బందులేదుర్కొన్నారు. 

Related posts