యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెషల్ డ్యాన్స్తో అలరించనుంది. బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘సాహో’ బడ్జెట్ రోజురోజుకు పెరుగుతుంటే రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదని.. ఇలా బడ్జెట్ పెరగడంతో చాలా ఒత్తిడిగా ఫీల్ అయ్యేవాడిని. సాహో కోసం ఎంతో కష్టపడ్డాము. స్క్రీన్ప్లేపై బెస్డ్గా మంచి కాన్సెప్ట్తో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్” అని తెలిపారు. ఈ సందర్బంగా ప్రభాస్ పలు ప్రశ్నలకు సమాధానాలిస్తూ “చిరంజీవి, రజనీకాంత్, రాజమౌళిలాంటి వారు తమ సినీ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప విజయాలు చూశారు.. అయిన కూడా వారు గ్రౌండెడ్గా.. అందరిని గౌరవిస్తూ సఖ్యతగా మెలిగారన్నారు. అలా ఆ విధంగా బతకడం వారి దగ్గరనుండే నేర్చుకున్నాను” అన్నారు.
previous post
next post
చిరంజీవి, మహేష్ బాబు ఇప్పుడేమయ్యారు ?… జర్నలిస్ట్ శ్వేతారెడ్డి సంచలన వ్యాఖ్యలు