భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై ఆయన అభిమానులు కొందరు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓటమి అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పవన్ ఓటమిపై సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మనీ, మద్యం ముందు మానవత్వం ఓడిపోయింది. ఈ రోజు ఓడిపోయింది పవన్ కళ్యాణ్ కాదు… తెలుగు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే’’ అంటూ ఆది ట్వీట్ చేశాడు. హైపర్ ఆది జనసేనకు సంబందించిన ప్రచారాల్లో మీటింగ్ లలో పాల్గొని పవన్ తరపున ప్రచారం కూడా చేశాడు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు నెగిటివ్ కామెంట్స్ తో కౌంటర్లు వేస్తూనే ఉన్నాడు. గాజువాక, భీమవరం స్థానాల్లో పవన్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఆయా స్థానాల్లో వైసిపి అభ్యర్థులు నాగిరెడ్డి, గ్రంథి శ్రీనివాస్ గెలుపొందడం విశేషం.