telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

రాజన్న దర్శనానికి హెలికాప్టర్ సర్వీసులు

helicopter

సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరి స్వామి వారి దర్శనానికి తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వెళుతుంటారు. ఈ క్రమంలో ఈ సర్వీసులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

త్వరలో రానున్న ‘శివరాత్రి’ పండగ నేపధ్యంలోపెద్ద సంఖ్యలో వెళ్ళే భక్తులను దృష్టిలో పెట్టుకుని హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేములవాడలో శివరాత్రి జాతర వేడుకల్ని వైభవంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుంచి వేములవాడకు ప్రత్యేక ప్యాకేజీల్లో హెలికాప్టర్ సేవలు అందించనున్నారు.

Related posts