telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో 150 కిలోల బంగారం పట్టివేత

Gold Biscuits Caught at Airport

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెద్దమొత్తంలో అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఎన్నో సార్లు పట్టుబడ్డ బంగారం కంటే ఈసారి కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్టులోని కార్గో విభాగం నుంచి 150 కిలోలకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మలేషియా నుంచి హైదరాబాద్ కు అక్రమంగా బంగారం తరలిస్తున్నట్టు గుర్తించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేని ఓ ఏజెన్సీ ఈ అక్రమరవాణాకు సూత్రధారి అని తెలుస్తోంది.

Related posts