ఈనెల 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించడంతో జనం ముందస్తు కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రైతు బజార్లు ఈరోజు ఉదయం నుంచి కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సరుకులు లభించవేమోనన్న ఆందోళనతోపాటు ధరలు పెంచేస్తారేమోనన్న భయంతో చాలామంది ఉదయాన్నే మార్కెట్ బాటపట్టారు. దీంతో ఒక్కసారిగా రద్దీ నెలకొంది. ఇదే అదనుగా దళారులు ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు.
నాలుగు రోజుల క్రితం పదిరూపాయల కంటే తక్కువ ఉన్న టమాటా ధర ఏకంగా నలభై రూపాయలకు పెంచేశారు.హైదరాబాద్, విజయవాడ, విశాఖ, ఖమ్మం, వరంగల్, నిర్మల్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లోని రైతు బజార్లలో ఒకేలాంటి పరిస్థితి దర్శనమిచ్చింది. దాదాపు వారంపాటు లాక్డౌన్ కొనసాగనుండడంతో కూరగాయలు, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు జనం బారులు తీరారు.
జగన్ ఢిల్లీ పర్యటన పై టీడీపీ నేతల విమర్శలు