telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

హైద్రాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Accident

హైద్రాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్మన్‌ఘాట్‌లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా చెట్టును ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది.

గుబ్బల మంగమ్మ గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు ప్రభు, సాయినాథ్, వినాయక్ శ్రీగా గుర్తించారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts