telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

హైదరాబాద్ : మసాజ్ పేరుతో.. వ్యభిచారం.. పట్టుబడ్డ యాజమాన్యం..

SIT Investigation YS viveka Murder

మారేడ్‌పల్లి పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న మసాజ్‌, సెలూన్‌ సెంటర్‌పై దాడులు నిర్వహించారు. మసాజ్‌ సెంటర్‌ మేనేజర్‌, విటుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించగా, ముగ్గురు యువతులను పునరావాస కేంద్రానికి తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం….వెస్ట్‌మారేడ్‌పల్లి ప్రధాన రహదారిలోని ఓ భవనంలో ‘స్టూడియో మేక్‌ ఓవర్‌ సెలూన్‌ అండ్‌ స్పా’ పేరుతో మాసాజ్‌, సెలూన్‌ కేంద్రాన్ని నిర్వాహకురాలు మమత నిర్వహిస్తుంది. ఈ కేంద్రానికి మేనేజర్‌గా శేఖర్‌ వ్యవహరిస్తున్నాడు. అయితే కొంత కాలంగా ఈ సెంటర్‌లో మసాజ్‌ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

ఆ సమాచారం అందుకున్న అధికారులు వెంటనే డీఐ పద్మ, ఎస్‌ఐ రవి, ఏఎస్‌ఐ గౌరి, మహిళా హోంగార్డు కనకలక్ష్మి, కానిస్టేబుల్స్‌ సతీష్‌, రాజులు ఆ కేంద్రంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో ముగ్గురు వ్యభిచారులు, ఒక విటు డు, ఈ కేంద్రం మేనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేనేజర్‌ శేఖర్‌, విటుడు కిరణ్‌బాబులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించించగా, నిర్వాహకురాలు మమత పరారీలో ఉందని పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యభిచారులను మహేశ్వరంలోని పునరావాస కేంద్రానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts