telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేపు ఓయూ లో ‘జనసేన’విద్యార్థి గర్జన

janasena

హైదరాబాద్ లో ‘జనసేన’ విద్యార్థి గర్జన నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉస్మానియా యూనివర్శిటీ లోని ఆర్ట్స్ కాలేజ్ లో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విద్యార్థి గర్జన నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ‘జనసేన’ ఓ ప్రకటన విడుదల చేసింది.

వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, తెలంగాణలో మద్యపాన నిషేధం విధించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ గర్జన నిర్వహించనున్నట్లు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది. నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేసింది.

Related posts