telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

హైదరాబాద్ మెట్రో రైలు దారి తప్పింది.. లక్డీకాపూల్ లో నిలిపివేత

hightech city metro by this month last week

హైదరాబాద్ మెట్రో రైలు  వేరే ట్రాక్ లోకి వెళ్లిపోయింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ కు వెళ్లాల్సిన మెట్రో సర్వీసు అది వెళ్లాల్సిన ట్రాక్ పై కాకుండా వేరే ట్రాక్ లో పయనించింది. ఈ పొరపాటును గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. లక్డీకాపూల్ స్టేషన్ లో ట్రైన్ ను నిలిపివేశారు. అందులో ప్రయాణిస్తున్న  సుమారు నాలుగు వందల మంది ప్రయాణికులను దించివేశారు. 

అనంతరం మెట్రో ట్రైన్ వెనక్కి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ పొరపాటును అధికారులు వెంటనే గుర్తించడంతో ప్రమాదం తప్పింది. , లేకపోతే ఎదురుగా మరో రైలు వచ్చి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు.

Related posts