హైదరాబాద్ మెట్రో రైలు వేరే ట్రాక్ లోకి వెళ్లిపోయింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ కు వెళ్లాల్సిన మెట్రో సర్వీసు అది వెళ్లాల్సిన ట్రాక్ పై కాకుండా వేరే ట్రాక్ లో పయనించింది. ఈ పొరపాటును గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. లక్డీకాపూల్ స్టేషన్ లో ట్రైన్ ను నిలిపివేశారు. అందులో ప్రయాణిస్తున్న సుమారు నాలుగు వందల మంది ప్రయాణికులను దించివేశారు.
అనంతరం మెట్రో ట్రైన్ వెనక్కి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ పొరపాటును అధికారులు వెంటనే గుర్తించడంతో ప్రమాదం తప్పింది. , లేకపోతే ఎదురుగా మరో రైలు వచ్చి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు.