telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సందీప్ కిషన్ కు షాకిచ్చిన జీహెచ్ఎంసీ

Sandeep-KIshan

హీరో సందీప్ కిషన్ నటిస్తూ, నిర్మించిన చిత్రం “నిను వీడను నీడను నేనే”. ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించగా దయా పన్నెం, సందీప్ కిషన్, వీజీ సుబ్రహ్మణ్యన్ నిర్మించారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. ఇక సందీప్ కిషన్ సరసన హీరోయిన్ అన్యాసింగ్ నటించారు. ఈ చిత్రం జులై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే జీహెచ్ఎంసీ అధికారులు హీరో సందీప్ కిషన్‌కు షాక్ ఇచ్చారు. ఈ చిత్రం ప్రమోషన్ కోసం హైదరాబాద్‌లోని మెట్రో పిల్లర్ల వద్ద ప్రచార పోస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ పోస్టర్లను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించారు. పోస్టర్లలో హీరో, హీరో‌యిన్ను అసభ్యంగా చూపించారని ఉప్పల్‌కు చెందిన కొంతమంది ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉప్పల్ మెట్రో పిల్లర్ల వద్ద అంటించిన “నిను వీడను నీడను నేనే” ప్రచార పోస్టర్లను చించివేశారు. అయితే అధికారుల తీరుపై ఈ సినిమా యూనిట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా ప్రచార కార్యక్రమాలకు జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్నామని, అయినా పోస్టర్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts