telugu navyamedia
క్రైమ్ వార్తలు

హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య…

హైదరాబాద్ మైసమ్మగూడలో దారుణం జరిగింది. ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. జనగామ జిల్లా లింగాల గుణ‌పురంకు చెందిన కొయేటి మాధవి (20).. ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతుతూ.. ప్రైవేట్ హాస్టల్ లో ఉంటుంది.

శుక్రవారం రాత్రి హాస్టల్‌ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుర్తించిన హాస్టల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివ‌రాలు..
గ‌త నెల‌లో మాధ‌వి తండ్రి చ‌నిపోగా అప్ప‌టి నుంచి ఇంటి వ‌ద్దే ఉంటున్న ఆమె రెండు రోజుల క్రితం ప్రైవేట్ హాస్టల్ కి వ‌చ్చింది. శుక్ర‌వారం సాయంత్రం స్నేహితులు బ‌య‌ట‌కు వెళ్ళ‌గా గ‌దిలో ఒంట‌రిగా ఉంటూ..తండ్రి జ్ఞాప‌కాలు నెమ‌రివేసుకుంటూ తీవ్ర మ‌న‌స్థాప‌నికి గురై చున్నీతో ఫ్యాన్ ఊరివేసుకోంది.

Related posts