telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

కూకట్ పల్లిలో చిరుత జాడలు లేవు.. ప్రచారం చేసిన వారి పై కేసు!

హైదరాబాద్ కూకట్ పల్లిలో ప్రాంతంలో చిరుతపులి తిరుగుతుందన్న వార్త దావనంలో వ్యాపించడంతో ఆ ప్రాంతావాసులు భయాందోళనకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఈ ప్రాంతంలో అణువణువూ పరిశీలించి, చిరుతపులి తిరిగిన జాడలు లేవని స్పష్టం చేశారు. కూకట్ పల్లి, ప్రగతినగర్ వాసులు ఏ మాత్రం భయం లేకుండా ఉండవచ్చని అధికారులు భరోసా ఇచ్చారు.

ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నదన్న వార్తలు పూర్తిగా అవాస్తమని తేల్చారు. చిరుత తిరిగిందన్నట్టు చెబుతున్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించి, పాదముద్రలు తదితరాలను అన్వేషించారు. చిరుత ఈ ప్రాంతంలో తిరగలేదని తేల్చారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఓ స్కూల్ వాచ్ మన్ నర్సయ్య, డ్రైవర్ రాజులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. వారు ఈ వీడియోలను ఎలా తయారు చేశారు? ఎందుకు వాటిని ప్రచారం చేశారన్న విషయాలపై విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Related posts