హైదరాబాదులోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటర్సిటీ, ఎంఎంటీఎస్ రైళ్లు ఢీకొనడంతో 30 మందికిపైగా గాయాలైనాయి. ఆగివున్న ఉన్న ఇంటర్సిటీ రైలు ట్రాక్పైకి ఎంఎంటీఎస్ ట్రైన్ వచ్చి ఢీకొట్టింది. సిగ్నల్ చూసుకోకపోవడంతోనే రెండు ట్రైన్లు ఒకే ట్రాక్పైకొచ్చినట్టు తెలుస్తోంది. టెక్నికల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు.
స్టేషన్ కావడంతో రైలు వేగం తక్కువగా ఉందని, లేదంటే పెను ప్రమాదం సంభవించేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో ఎంఎంటీఎస్ ట్రైన్ మూడు కోచ్లు ధ్వంసమయ్యాయి. మరో ఆరు కోచ్లు పట్టాలపై పడిపోయాయి. ఎంఎంటీస్ ట్రైన్ డ్రైవర్ ఇంజన్లో ఇరుక్కుపోయారు. అతన్ని బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దొంగలెక్కల వీసారెడ్డి స్కూల్లో.. సజ్జల శిక్షణ పొందినట్లున్నారు: అనురాధ