telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ఉగ్రరూపం.. కొత్తగా 329 కొత్త కేసులు

Corona

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. కొత్తగా 329 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పొరుగునే ఉన్న రంగారెడ్డి జిల్లాలోనూ 129 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 499 కేసులు నమోదు కాగా, మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,526కి పెరిగింది.

ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3,352గా నమోదైంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో మూడు మరణాలు సంభవించగా, కరోనా మృతుల సంఖ్య 198కి చేరింది. ప్రస్తుతం 2,976 మంది చికిత్స పొందుతున్నారు.

Related posts