సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అనంతరం నిల్వ ఉన్న రసాయనాలకు అంటుకుని ఫ్యాక్టరీ మొత్తం మంటలు విస్తరించాయి. మంటల్లో చిక్కుకుని గాయపడిన ముగ్గురు కార్మికులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఫ్యాకర్టీ మొత్తం మంటలు వ్యాపించడంతో పక్కనే ఉన్న మరో మూడు కంపెనీలు కూడా అంటుకున్నాయి. సమాచారం అందుకున్న ఐదు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే, ఆ ప్రాంతంలో నీటి కొరత ఉండడంతో మంటలను అదుపు చేయడం కొంత ఆలస్యమైంది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
ఆర్థిక వ్యవస్థను జగన్ పట్టించుకోవట్లేదు: యనమల