telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలి!

Least voting city is hyderabad

హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని కోరుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబులకు సోమవారం ఢిల్లీలో సౌత్‌ ఇండియా జేఏసీ, అడ్వకేట్‌ జేఏసీ నేతలు వినతిపత్రం సమర్పించారు. అనంతరం సౌత్‌ ఇండియా జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌, సౌత్‌ ఇండియా అడ్వకేట్‌ జేఏసీ కన్వీనర్‌ ఎస్‌.నాగేందర్‌ మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఇష్టపడిన హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేస్తే దక్షిణాది రాష్ట్రాలు ఇంకా అభివృద్ధి చెందుతాయన్నారు. ఢిల్లీలో ఉన్న అన్ని కేంద్ర శాఖలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. దక్షిణాదికి అన్యాయం చేస్తున్న పాలక పార్టీలను ప్రశ్నించాలన్నారు. దక్షిణాదికి చెందిన ఆరు రాష్ట్రాల కవులు, కళాకారులు, మేధావులతో త్వరలో దక్షిణాది శంఖారావ మహాసభను నిర్వహిస్తామని తెలిపారు.

Related posts