telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడు హైదరాబాద్‌కు చంద్రబాబు.. హుజుర్ నగర్ టీడీపీ అభ్యర్థి ఫైనల్!

chandrababu

తెలంగాణలో అక్టోబర్ 21న హుజుర్ నగర్ అసెంబ్లీకీ ఉప ఎన్నిక జరగనుంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ లు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. కాంగ్రెస్ కంచుకోట అయిన హుజుర్ నగర్‌లో జెండా పాతి తీరాల్సిందేనని టీఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి జోరుగా దూసుకెళ్తున్నారు. అయితే కంచుకోటలో మళ్లీ జెండా ఎగరేయాలని కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

టీడీపీ సైతం ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. గత రెండ్రోజులుగా తెలంగాణ టీడీపీ నేతలతో నిశితంగా చర్చించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు హుజూర్ నగర్‌లో పోటీకే మెగ్గు చూపుతున్నారు. నేడు హైదరాబాద్‌కు చంద్రబాబు రానున్నారు. మధ్యహాన్నం 3గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ నేతలతో సమావేశమై హుజుర్ నగర్ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.

Related posts