telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్‌ఎస్‌ ఆదరణను చూసి కాంగ్రెస్‌, బీజేపీలు భయపడుతున్నాయి: మంత్రి సత్యవతి

sathyavathi rathod

హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజక వర్గ ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు.  అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేస్తుందని అన్నారు. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా సైదిరెడ్డి బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో తెరాసకు ఆదరణ పెరిగిందని.. మమ్మల్ని చూసి కాంగ్రెస్, బీజేపీ కలవరానికి గురవుతున్నాయన్నారు.

నియోజక వర్గంలో అభివృద్ధి వేగవంతం కావాలంటే సైదిరెడ్డిని గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ గెలుస్తుందన్న భ్రమలో ఉందన్నారు. గిరిజన తండాల్లోని ప్రజలు తమ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి చెప్పారు. తొలుత పద్మావతికి టికెట్ వద్దన్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తిరిగి ఆమెకే అనుకూలంగా ప్రచారానికి దిగాడని ఎద్దేవా చేశారు.

Related posts