telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక.. జిల్లా ఎస్పీ పై బదిలీ వేటు

election-commission

తెలంగాణలోని హుజుర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లుపై బదిలీ వేటు వేసింది. హెడ్‌క్వార్టర్‌లో రిపోర్ట్‌ చేయాలని, ఎన్నికల సంబంధించిన విధులు ఆయనకు కేటాయించవద్దని ఉన్నతాధికారులకు ఈసీ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

ఆయన స్థానంలో 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆర్‌. భాస్కరన్‌ను సూర్యాపేట జిల్లా ఎస్పీగా నియమించింది. భాస్కరన్ ప్రస్తుతం భూపాలపల్లి ఎస్పీగా పనిచేస్తున్నారు.హుజుర్‌నగర్‌లో గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించడం విశేషం.

Related posts