telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హుజూర్ నగర్ లో కొనసాగుతున్న పోలింగ్.. మొరాయించిన ఈవీఎం

evm issues even in 4th schedule polling

తెలంగాణలో హుజూర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. నియోజక వర్గంలోని మేళ్లచెరువులోని 133 కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. దీంతో, వెంటనే మరో ఈవీఎంను అధికారులు ఏర్పాటు చేశారు. ఇది కూడా మొరాయించడంతో ఆ బూత్ లో పోలింగ్ ను అధికారులు నిలిపేశారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి యత్నిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 2,36,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వీరి కోసం 302 పోలింగ్ కేంద్రాల్లో 1708 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మొత్తం 79 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఈ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts