telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

నూతన దంపతుల మధ్య రాఖీ చిచ్చు.. ఉరేసుకొని భర్త ఆత్మహత్య

rakhee silver

ప్రేమ పెళ్లి చేసుకొని ఆనందంగా జీవనం సాగిస్తున్న నూతన దంపతుల మధ్య వెండి రాఖీ చిచ్చు పెట్టింది. రాఖీ కోసం భార్య , భర్తలు గొడవపడ్డారు. దీంతో మనస్తాపం చెందిన భర్త ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన రవీంద్రాచారి(23) రెండు నెలల క్రితం వరంగల్ రూరల్ జిల్లా గుడెప్పాడ్ గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. హన్మకొండ కొత్తూరు, సుభాష్ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు నివసిస్తున్నారు. కాగా రవీంద్రాచారి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

ఇటీవల ఫైనాన్స్ డబ్బులు కట్టలేదని ఆటోని ఫైనాన్స్ సిబ్బంది లాకొన్నారు. దీంతో ఆటో నడపకపోవడంతో అతని దగ్గర డబ్బులు లేవు. కుటుంబ పోషణ కూడా కష్టంగా మారింది. అలాంటి సమయంలో భార్య.తన సోదరులకు కట్టేందుకు వెండి రాఖీలు కావాలని కోరింది. డబ్బులు లేని సమయంలో వెండి రాఖీలు కావాలని అడిగేసరికి భార్యను మందలించాడు. ఈ క్రమంలో ఇద్దరిమధ్య గొడవపడింది. మనస్తాపం చెందిన రవీంద్రాచారి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

 

Related posts