ప్రస్తుత దేశరాజకీయ పరిస్థితులలో కేంద్రంలో హంగ్ ఏర్పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ కు ఎవరైతే అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపై సంతకం చేస్తారో వారికే తమ మద్దతు అని వైసీపీ అందినేత జగన్ అన్నారు. తమ పార్టీ కూడా వచ్చే ఎన్నికలలో ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆయన అన్నారు. లోటస్ పాండ్లో ఆయన తటస్థులతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా తమ పార్టీ విధివిధానాలు గురించి వారికి వివరించారు.
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా హంగ్ వస్తేనే మంచిదని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. 25 ఎంపి స్థానాలను ప్రజలు వైఎస్సార్సీ కట్టబెడతారని, దీని ద్వారా కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామన్నారు. రైల్వేజోన్ అంశంపై తనకు పూర్తిగా అవగాహాన ఉందని వైఎస్ అన్నారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు రైల్వేజోన్ ఉందని, చట్ట ప్రకారం విశాఖకు రైల్వే జోన్ రావాలన్నారు. రైల్వే జోన్ కోసం వైఎస్సార్సీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్ కోసం అలుపెరగని పోరాటం చేస్తామన్నారు.